యాప్నగరం

షిర్డీ క్షేత్రానికి విమాన సేవలు..

షిర్డీ ప్రయాణికులకు శుభవార్త. సాయినాథుడి సందర్శనకు వెళ్లే భక్తులు ఇకపై ఎంచక్కా విమానంలో ప్రయాణించవచ్చు. షర్డీ పుణ్యక్షేత్రానికి విమాన సర్వీసుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను మంగళవారం (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం విజయవంతంగా పరీక్షించారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి..

TNN 26 Sep 2017, 9:55 pm
షిర్డీ ప్రయాణికులకు శుభవార్త. సాయినాథుడి సందర్శనకు వెళ్లే భక్తులు ఇకపై ఎంచక్కా విమానంలో ప్రయాణించవచ్చు. షర్డీ పుణ్యక్షేత్రానికి విమాన సర్వీసుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను మంగళవారం (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం విజయవంతంగా పరీక్షించారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానం ‘ఎయిర్ ఏటీఆర్ 72’ సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో షిర్డీలో ల్యాండ్ అయింది. కేవలం 35 నిమిషాల్లో ఇది షిర్డీకి చేరుకుంది. రోడ్డు మార్గం ద్వారా ముంబై నుంచి షిర్డీకి ప్రయాణ సమయం 6 గంటలకు పైగా ఉంది.
Samayam Telugu president ram nath kovind to inaugurate shirdi airport on october 1
షిర్డీ క్షేత్రానికి విమాన సేవలు..


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అక్టోబర్ 1న షిర్డీకి విమాన సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విమాన సర్వీసుతో సమయం భారీగా ఆదా అవుతుండటంతో.. షిర్డీలో పర్యాటకంగా మరింత వృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. దీంతో ఆదాయం కూడా భారీగానే సమకూరనుంది. మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఈ విమాన సర్వీసులను నడపనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.