యాప్నగరం

ట్రిపుల్ తలాక్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర.. చట్టంగా మారిన బిల్లు

Triple talaq | ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లు ఇక నుంచి చట్టంగా మారింది. గత వారం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఓకే చెప్పారు.

Samayam Telugu 1 Aug 2019, 3:00 pm
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. చట్టరూపం దాల్చింది. ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు తాజాగా గురువారం (ఆగస్టు 1) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2019 పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత మంగళవారం ట్రిపుల్ తలాక్ నిషేధ బిలు రాజ్యసభ ఆమోదం పొందగానే లింగ సమానత్వానికి గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని రాష్ట్రపతి ట్విట్టర్‌లో ప్రశంసించిన విషయం తెలిసిందే.
Samayam Telugu ramnath kovid2


ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే భర్తలకు మూడేళ్లపాటు జైలు శిక్ష విధిస్తారు. ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ రాజ్య సభ గత మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్‌లో 99-84 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు జులై 25న లోక్‌స‌భ‌ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో చట్టంగా రూపుదిద్దుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.