యాప్నగరం

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఆ ముగ్గురుతోపాటు అద్వాణీ?

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ తరఫున భాజపా కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీని ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

TNN 19 Jun 2017, 12:15 pm
ఎన్టీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సందిగ్ధతకు ఎట్టకేలకు ముగింపు పలకబోతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా చాలా మంది పేర్లను పరిశీలించిన భాజపా అధిష్ఠానం చివరకు కురువృద్ధుడు అద్వాణీ వైపే మొగ్గు చూపింది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాసేపట్లో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి అభ్యర్థిని జూన్ 23 న ప్రకటిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలంతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
Samayam Telugu presidential poll nda candidate will announce shortly
రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఆ ముగ్గురుతోపాటు అద్వాణీ?


అలాగే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిల పేర్లను కూడా ఈ రేసులో ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు. సుష్మా స్వరాజ్ ఇప్పటికే ఈ ఎన్నిక‌ల్లో తాను అభ్యర్థిగా నిలబడనున్నట్టు వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని రెండు రోజుల కిందట అన్నారు. దీనిపై మీడియా ప్ర‌శ్నలకు స‌మాధానమిచ్చన సుష్మ తాను ప్రస్తుతం విదేశాంగమంత్రినని, రాష్ట్రపతి అభ్యర్థిపై మీరు అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం అని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.