యాప్నగరం

సీఎం సాబ్ వస్తుంటే.. అంబులెన్సయినా ఆగాల్సిందే

ఎర్ర బుగ్గ తొలగిస్తేనేమీ.. వీఐపీలు వస్తున్నప్పుడు అంబులెన్స్‌లైనా ఆగాల్సిందే.

TNN 4 May 2017, 2:05 pm
వాహనాలపై ఉండే ఎర్ర బుగ్గను తొలగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎంలు, మంత్రులు తమ వాహనాలకు ఉన్న ఎర్ర బుగ్గను తొలగించారు. కానీ వీఐపీ జాఢ్యం మాత్రం పూర్తిగా వదల్లేదు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య కాన్వాయ్‌కు దారి ఇవ్వడం కోసం పేషెంట్లను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లను నిలిపేశారు. 24 గంటల్లో రెండుసార్లు ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
Samayam Telugu preventing ambulances from smooth traffic to karnataka cm
సీఎం సాబ్ వస్తుంటే.. అంబులెన్సయినా ఆగాల్సిందే


మంగళవారం సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో భగీరథ జయంతి వేడుకల్లో పాల్గొనడం కోసం సీఎం బయల్దేరారు. ఆయన కాన్వాయ్ జేసీ రోడ్డుకు చేరినప్పుడు ఓసారి, బుధవారం ప్యాలెస్ గ్రౌండ్స్ వెళ్తున్నప్పుడు మరోసారి అంబులెన్స్‌లను నిలిపేశారు. సీఎం కాన్వాయ్ రవీంద్ర కళాక్షేత్రానికి చేరుకునే సమయంలో కార్పోరేషన్ సర్కిల్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను మూడు నిమిషాలపాటు ఆపారు. అంబులెన్స్ ఓవైపు సైరన్ మోగిస్తున్న పోలీసు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది సీఎం సేవలో తరించారు.

బుధవారం నాడు కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ ప్యాలెస్ గ్రౌండ్స్‌కు వెళ్తున్న సమయంలో 10 నిమిషాల పాటు అంబులెన్స్‌ను ఆపేయాల్సి వచ్చింది. అంతకు ముందే అసెంబ్లీలో జనం రోడ్ల మీద అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోవడం పట్ల సీఎం తీవ్రంగా స్పందించారు.


కాన్వాయ్ కారణంగా అంబులెన్స్‌లను ఆపేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకురాగా.. ఈ సంగతి తనకు తెలియదని, పూర్తి సమాచారం తెప్పించుకుని ఈ ఘటనపై విచారణ చేపడతామని సిద్ధూ బదులిచ్చారు.

ఈ వార్తను కన్నడలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.