యాప్నగరం

జయ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్న ప్రధాని

తమిళనాడు ముఖ్యమంత్రి, తన స్నేహితురాలైన జయలలిత ఆరోగ్యం ఎలా ఉందనే విషయమై ప్రధాని మోదీ రోజూ వివరాలు తెలుసుకుంటున్నారట.

TNN 18 Oct 2016, 8:33 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న నాటి నుంచే వీరు మంచి మిత్రులగా మెలిగేవారు. ఇటీవల జయలలిత అనారోగ్యం పాలై చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు లండన్ నుంచి వచ్చిన ఓ వైద్యుడు చికిత్స అందించగా, ఎయిమ్స్ నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే వారిద్దిర్నీ చెన్నై పంపడం వెనుక ప్రధాని మోదీ చొరవ ఉందట. ఆమె ఆరోగ్యం గురించి ప్రధానికి రోజూ సమాచారం అందుతూనే ఉందట. ప్రధాని పదవిని చేపట్టాలనే తలంపు వచ్చిన వెంటనే ఆయన ఆ విషయాన్ని జయలలితకు చెప్పారని, ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారని కూడా జనాలు చెప్పుకుంటుంటారు. జయను పరామర్శించడం కోసం హాస్పిటల్ దాకా వెళ్లినప్పటికీ చాలా మంది ప్రముఖులు ఇప్పటి దాకా ఆమె ఉన్న ఐసీయూలోకి వెళ్లలేకపోయారు. కానీ ప్రధాని మాత్రం ఢిల్లీ నుంచే సమాచారం తెప్పించుకుంటున్నారు.
Samayam Telugu prime minister modi getting updates of jayalalithaa health daily
జయ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్న ప్రధాని

ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో ఇలా అభిమానపూర్వకంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో జ్వరంతో బాధపడ్డారు. అప్పుడు కూడా మోదీ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి, అవసరమైతే జ్వరం తగ్గేదాకా ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోమని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.