బిజిబిజీగా సాగనున్న ప్రధాని జపాన్ టూర్... 40 గంటలు, 23 సమావేశాలు
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన 40 గంటల పాటు అక్కడ ఉన్నాను. ఆయన టూర్ చాలా బిజి బిజిగా సాగనుంది. 23 సమావేశాల్లో పాల్గొనున్నారు. వివిధ ప్రపంచ నేతలతో పాటు, వివిధ కంపెనీల సీఈవోలతోనూ ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన ఒక రాత్రి టోక్యోలో, రెండు రాత్రులు విమానాల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాపార, దౌత్య, సమాజ పరమైన చర్చలు జరపనున్నారు.
ప్రధానాంశాలు:
- మే 24న టోక్యోలో సదస్సులో పాల్గోనున్న పీఎం
- ముగ్గురు ప్రపంచ నేతలతో, సీఈవోలతో భేటీ
- ఒక రాత్రి టోక్యోలో, రెండు రాత్రులు ఫ్లైట్లో ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ టూర్ హాట్ టాపిక్గా మారింది. సదస్సు కోసం వెళ్లే ఆయన పర్యటన చాలా బిజి బిజిగా సాగనుంది. ప్రధాని మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో పాటు ప్రధాని పాల్గోనున్నారు. ఈ సందర్భంగా అనేక నేతలతో ఆయన సమావేశం కానున్నారు. జపాన్లో దాదాపు 40 గంటలపాటు ముగ్గురు ప్రపంచ నేతలతోపాటు, వివిధ కంపెనీల సీఈవోలతోనూ సమావేశం అవుతారని, మరో 23 కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. ప్రధాని మోదీ.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధాన మంత్రులతో భేటీ కానున్నారు. వీరితోపాటు వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా వ్యాపార, దౌత్య, సమాజ పరమైన చర్చలు జరపనున్నట్టు తెలుస్తుంది. కనీసం 36 మంది జపనీస్ సీఈవోలతో, వందలాది మంది భారతీయ ప్రవాస సభ్యులతో కూడా మాట్లాడనున్నారు. ప్రధాని ఒక రాత్రి టోక్యోలో, రెండు రాత్రులు విమానంలో ప్రయాణిస్తారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
జపాన్ ప్రధాని కిషిది ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జరిగే టోక్యోలో మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొంటారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సదస్సులో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రపంచ సమస్యల గురించి అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ అభిప్రాయాల ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.
జపాన్ ప్రధాని కిషిది ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జరిగే టోక్యోలో మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొంటారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సదస్సులో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రపంచ సమస్యల గురించి అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ అభిప్రాయాల ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.