యాప్నగరం

ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో లైన్ ముంద్కా నుంచి బహదూర్‌గఢ్ వరకు 11 కిలోమీటర్ల మేర ఉంది

Samayam Telugu 24 Jun 2018, 12:55 pm
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో లైన్ ముంద్కా నుంచి బహదూర్‌గఢ్ వరకు 11 కిలోమీటర్ల మేర ఉంది. గ్రీన్ లైన్ మార్గంలో మెట్రో రైలును ఆదివారం సాయంత్రం నాలుగు గంట‌ల నుంచి న‌డుపుతారు. గ్రేట్ వే ఆఫ్ హ‌ర్యానాగా పిల‌వ‌బ‌డే మెట్రో మార్గ‌మైన ఈ 11 కిలోమీటర్ల మధ్య ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక ప్రజలందరూ తమ ప్రైవేట్ వాహనాలను పక్కన పడేసి మెట్రో రైలెక్కాలని ఆయన పిలుపునిచ్చారు.
Samayam Telugu delhi metro green line
ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్‌


దేశంలోని అన్ని నగరాల్లో సౌకర్యవంతమైన, చవకైన ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని మోదీ స్పష్టంచేశారు. మెట్రో వ్యవస్థలు సహకార సమాఖ్య వ్యవస్థకు అనుసంధానంగా ఉంటాయని, దేశంలో మెట్రో రైళ్లు ఉన్న రాష్ర్టాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నది అని మోదీ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి హ‌ర్‌దీప్ పూరి, హ‌ర్యాణా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ పాల్గొన్నారు.

ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్‌


మేకిన్ ఇండియాను ప్రస్తావిస్తూ మెట్రో కోచ్‌లను ఇండియాలోనే తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో దేశాల మన మెట్రో వ్యవస్థలకు తోడ్పాటునందించాయి. ఇప్పుడు మెట్రో కోచ్‌లను తయారు చేయడం ద్వారా వాళ్ల దేశాల్లో మెట్రో వ్యవస్థలకు మనం సాయం చేద్దాం అని మోదీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.