యాప్నగరం

స్వాగతిస్తున్నాం.. కానీ సంపూర్ణ స్వేచ్ఛ కాదు

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అంటూ సుప్రీంకోర్టు గురువారం (ఆగస్టు 24) కీలక తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌..

TNN 24 Aug 2017, 6:25 pm
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అంటూ సుప్రీంకోర్టు గురువారం (ఆగస్టు 24) కీలక తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ అంశంపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన.. ‘కోర్టు తీర్పును ప్రభుత్వం స్వాగతిస్తోంది. అయితే వ్యక్తిగత గోప్యత అనేది సంపూర్ణమైన స్వేచ్ఛ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
Samayam Telugu privacy a fundamental right subject to reasonable restrictions govt
స్వాగతిస్తున్నాం.. కానీ సంపూర్ణ స్వేచ్ఛ కాదు


‘వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఆధార్‌ చట్టం ముందుగానే తెలిపింది. ఆధార్‌ బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. అయితే అది సంపూర్ణమైన హక్కు కాదని అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఆధార్‌ తప్పనిసరి చేసిన సమయంలో డేటా ప్రొటెక్షన్‌ కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. గత మూడేళ్లలో రూ. 57000 కోట్ల నగదును మధ్యవర్తుల చేతికి వెళ్లకుండా చూడగలిగాం. ఆధార్‌ లాంటి ఓ సాంకేతిక అద్భుతాన్ని ప్రపంచం మొత్తం కొనియాడింది’ అని రవిశంకర్‌ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.