యాప్నగరం

ఘోర విషాదం: కాలువలో పడిన బస్సు.. 22 మంది మృతి

మొత్తం 22 మృతదేహాలను కాలువ నుంచి వెలికితీసినట్లు మంత్రి చెప్పారు. ఒక్క విద్యార్థిని కాపాడగలిగామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Samayam Telugu 24 Nov 2018, 2:22 pm
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు కావేరీ నది వీసీ కెనాల్‌లో పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందినవారిలో ఎక్కువ మంది స్కూలు పిల్లలు, మహిళలే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Samayam Telugu Bus_Accident

ఈ ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీఎస్ పుట్టరాజు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. మొత్తం 22 మృతదేహాలను కాలువ నుంచి వెలికితీసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థి బస్సులో నుంచి దూకేశాడని, అతనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడని మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. బస్సును కాలువ నుంచి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసు వ్యవస్థను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం మాండ్యలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.