యాప్నగరం

ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో రహదారి రక్తమోడింది. టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఘటనాస్థలి భీతావహంగా మారింది.

Samayam Telugu 3 Jul 2019, 5:02 pm
ర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చిక్కబళ్లాపూర్‌లోని చింతామణి సమీపంలో బుధవారం (జులై 3) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చింతామణి నుంచి బెంగళూరు వైపు వెళ్లున్న ప్రైవేట్ బస్సు.. ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రైవేట్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Samayam Telugu accident
కర్ణాటక రోడ్డు ప్రమాదం


ప్రయాణికుల మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలి భీతావహంగా మారింది. టాటా ఏస్ వాహనం నుజ్జునుజ్జవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ మురుగపళ్ల నుంచి చింతామణి వైపు వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.