యాప్నగరం

ప్రత్యేక తమిళ దేశం కావాలట: పన్నీర్ సెల్వం

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని చెన్నైలోని మెరీనా బీచ్‌లో నిరసన చేపట్టిన ఆందోళకారుల్లో కొంత మంది ఒసామా బిన్ లాడెన్ చిత్రాలను ప్రదర్శించారని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీ చెప్పారు.

TNN 27 Jan 2017, 5:28 pm
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని చెన్నైలోని మెరీనా బీచ్‌లో నిరసన చేపట్టిన ఆందోళకారుల్లో కొంత మంది ఒసామా బిన్ లాడెన్ చిత్రాలను ప్రదర్శించారని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీ చెప్పారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జల్లికట్టు ఉద్యమకారులపై జరిగిన పోలీసు దాడులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత స్టాలిన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు.
Samayam Telugu pro jallikattu protesters displayed osama pictures and demanded a separate tn nation panneerselvam says
ప్రత్యేక తమిళ దేశం కావాలట: పన్నీర్ సెల్వం


శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసు బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఏముందని స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన సీఎం.. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకునే పోలీసులను రంగంలోకి దింపామని చెప్పారు. మెరీనా బీచ్‌లో చాలా మంది అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు, బ్యానర్లు ప్రదర్శించారని, కొంత మంది ప్రత్యేక తమిళ దేశం కావాలని డిమాండ్ చేసినట్లు సీఎం వివరించారు. కొతమందైతే గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చినట్లు పన్నీర్ సెల్వం చెప్పారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని కూడా సీఎం స్పష్టం చేసారు.

కొన్ని అసాంఘిక శక్తులు ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని గ్రహించే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొంతమంది నల్ల జెండాలను ప్రదర్శించారని, వారు రిపబ్లిక్ డే నాడు అల్లర్లు సృష్టించే అవకాశం ఉండటంతో అరెస్టులు చేసామని చెప్పుకొచ్చారు. ఆందోళనకారులు రేపిన అల్లర్లలో కొంత మంది పోలీసులు గాయపడ్డారని, చాలా వాహనాలు ధ్వంసమయ్యాయని వివరించారు. అయితే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. దీనిపై సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.