యాప్నగరం

అవినీతి పరులకు మోడీ వార్నింగ్

దేశంలోని అవినీతి పరులపై యుద్ధం ప్రకటించామని రానున్న 50 రోజుల్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరులకు మనుగడ లేకుండా చేస్తామని మోడీ హెచ్చరికలు జారీచేశారు.

TNN 24 Dec 2016, 11:59 pm
దేశంలోని అవినీతి పరులపై యుద్ధం ప్రకటించామని రానున్న 50 రోజుల్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరులకు కష్టాలు మరింత పెరుగుతాయని మోడీ హెచ్చరికలు జారీచేశారు. ముంబాయిలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ.. నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈ ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లధనాన్ని , అవినీతిని ఉపేక్షించేది లేదని నిరూపిందని, దేశ భవిష్యత్ కోసం ఇబ్బందులను అధిగమించేందుకు ప్రజలంతా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారన్నారు.
Samayam Telugu problems of dishonest people will rise after december30 pm modi warns the currupt
అవినీతి పరులకు మోడీ వార్నింగ్


డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరుల కష్టాలు పెరుగుతాయని అదే సమయంలో నీతిపరుల కష్టాలు క్రమంగా తగ్గుతాయన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ వారి సహాయాన్ని అందిస్తూనే ఉన్నారన్నారు. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో డెవలప్‌మెంట్ జరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

చత్రపతి శివాజీ గురించి మాట్లాడుతూ.. ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడంటూ శివాజీ సేవలను కొనియాడారు. ఆయన ప్రజలకు సుపరిపాలన అందించారిని, ప్రజల్లో స్ఫూర్తి నింపారన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముంబయిలో రెండు మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేశారు.

అంతకుముందు రాయగడలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ముంబయిలోని అరేబియా మహా సముద్రంలో ప్రత్యేక ఓడలో ప్రయాణించి ఛత్రపతి శివాజీ స్మారక స్తూపానికి జలపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.