యాప్నగరం

అల్లరిమూకల రాళ్ల దాడిలో జవాను మృతి

కశ్మీర్‌లో అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ఆర్మీ కాన్వాయ్‌పైకి రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఓ సైనికుడు దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 26 Oct 2018, 7:49 pm
ల్లరిమూకల రాళ్ల దాడిలో ఓ జవాను బలయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఈ ఘటన జరిగింది. గురువారం (అక్టోబర్ 25) సాయంత్రం అనంతనాగ్‌లో సరిహద్దు వెంట ఉన్న రహదారిపై వెళ్తున్న ఆర్మీ వాహనాలపై వేర్పాటువాదులు రాళ్లతో విరుచుకుపడ్డారు. అనంతనాగ్ బైపాస్ ట్రై జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనలో జవాన్ రాజేంద్ర సింగ్ (22) తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
Samayam Telugu Rajendra Singh


ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ ప్రాంతంలోని బదేనాకు చెందిన రాజేంద్ర సింగ్ 2016లో ఆర్మీలో చేరారు. సింగ్ మృతితో ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కశ్మీర్‌లో రెండు రోజులుగా జరిగిన ఘటనల్లో మొత్తం ముగ్గురు ఆర్మీ అధికారులు మృతి చెందారు. వీరిలో రాజేంద్ర సింగ్ ఒకరు.

సోపోర్‌లోని మాల్గునిపురాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లాన్స్ నాయక్ బ్రజేశ్ కుమార్ (32) వీర మరణం పొందారు. త్రాల్‌లోని లురగమ్ గ్రామంలో ఆర్మీ క్యాంప్‌పై ముష్కరుల దాడి ఘటనలో జ్ఞామ్సైమ్లియానా (23) అనే సిపాయి అమరులయ్యారు. బ్రజేశ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. జ్ఞామ్సై మిజోరాం రాష్ట్రానికి చెందినవారు. వీరికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.