యాప్నగరం

చరిత్రలో తొలిసారి.. ఆరుబయట అసెంబ్లీ సమావేశాలు..

ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలను ఆరుబయట చెట్టు కింద నిర్వహించారు.

Samayam Telugu 25 Jul 2020, 9:07 pm
కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించారు. ఆల్‌ ఇండియా ఎన్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌.ఎస్‌.జె. జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు.
Samayam Telugu puducherry assembly


జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. తొలి రెండు రోజులు జయబాల్ సమావేశాల్లో పాల్గొన్నారు. బడ్జెట్ రోజున మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయనతో కాంటాక్ట్ అయిన మిగతా ఎమ్మెల్యేలు సైతం హోం ఐసోలైషన్‌లోకి వెళ్లిపోయారు.

అసెంబ్లీ మెయిన్ హాల్‌ను శానిటైజ్ చేయాల్సి ఉండటంతో.. సమావేశాలను ఎక్కడ నిర్వహించాలనే విషయమై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ భవనం టాప్ ఫ్లోర్‌లో నిర్వహించాలని భావించినా.. చోటు చాలదనే కారణంతో చెట్టు కిందకు మార్చారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.