యాప్నగరం

కోవిడ్ వార్డులో టాయిలెట్ క్లీన్ చేసిన మంత్రి

ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కోవిడ్ వార్డులో టాయిలెట్ క్లీన్ చేసి వార్తల్లో నిలిచారు.

Samayam Telugu 30 Aug 2020, 3:10 pm
యానాం ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణా రావు కోవిడ్ వార్డులో టాయిలెట్ క్లీన్ చేశారు. శనివారం ఇందిరా గాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌‌ను సందర్శించిన ఆయన.. పీపీఈ కిట్‌తో వెళ్లి టాయిలెట్‌ను శుభ్రపరిచారు. హాస్పిటల్ స్టాఫ్ వెనకుండి చూస్తుండగా.. టాయిలెట్లను క్లీన్ చేస్తున్నారా? అని మంత్రి వారిని ప్రశ్నించారు. దీనికి సిబ్బంది బదులిస్తూ.. రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తున్నామన్నారు.
Samayam Telugu malladi cleans toilet


ఈ హాస్పిటల్ కోవిడ్ వార్డులో 75 మంది చికిత్స పొందుతున్నారు. టాయిలెట్లు వాడిన తర్వాత శుభ్రంగా ఉంచాలని చిన్న వయసున్న పేషెంట్లకు మంత్రి సూచించారు.పుదుచ్చేరిలో మొత్తంలో 14,127 కరోనా కేసులు నమోదు కాగా.. ఆదివారం ఒక్క రోజే 571 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 221 మంది చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.