యాప్నగరం

పుల్వామా ఉగ్రదాడి.. 49కి చేరిన మృతులు

ముష్కరమూకల దాడిలో తీవ్రంగా గాయపడి.. శ్రీనగర్ బాదామిబాగ్‌లోని 92వ బేస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న.. మరో నలుగురు సైనికులు అమరులు అయ్యారు. పుల్వామా దాడిలో 49కి చేరిన మృతులు.

Samayam Telugu 15 Feb 2019, 1:55 pm

ప్రధానాంశాలు:

  • గాయపడిన మరో నలుగురు జవాన్లు మృతి
  • 49కి చేరిన మృతుల సంఖ్య
  • ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న మరికొందరు జవాన్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu crpf
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన సంఖ్య 49కి చేరింది. ముష్కరమూకల దాడిలో తీవ్రంగా గాయపడి.. శ్రీనగర్ బాదామిబాగ్‌లోని 92వ బేస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. చాలా బాధాకరమైన విషయం.. చెప్పక తప్పడం లేదంటూ నలుగురు జవాన్లకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
జ‌మ్మూ - శ్రీన‌గ‌ర్ రహదారిపై లేత్‌పోరా ప్రాంతంలో గురువారం మ‌ధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్ర‌వాది ఫిదాయిన్ దాడి చేశాడు. ఉగ్ర‌వాది అదిల్ టార్గెట్ చేసిన బ‌స్సులో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లుప్రాణాలు విడిచారు. పేలుడు దెబ్బకు బస్సు పూర్తిగా ధ్వంసంకాగా.. సైనికుల మృత‌దేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. మరికొందరు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. ఆర్మీ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. మరోవైపు దాడిలో చనిపోయిన జవాన్ల మృత‌దేహాలను వారి సొంత ఊర్లకు పంపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.