యాప్నగరం

పుల్వామా ప్రతీకారం.. పాకిస్థాన్‌కు కస్టమ్స్ డ్యూటీ షాక్!

పుల్వామా దాడి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌పై భారత్ ఒక్కో అస్తాన్ని ప్రయోగిస్తోంది. ఎంఎన్ఎఫ్ హోదా ఉపసంహరించిన ఇండియా.. కస్టమ్స్ డ్యూటీని 200 శాతం పెంచింది.

Samayam Telugu 16 Feb 2019, 9:58 pm
పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్.. దాయాదిని ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీసే ప్రయత్నాలను ప్రారంభించింది. మొదటి చర్యగా పాకిస్థాన్‌కు గతంలో ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతా దేశం హోదాను ఉపసంహరించుకుంది. పొరుగు దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతం పెంచుతూ శనివారం మరో నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ డ్యూటీ పెంపు విషయాన్ని శనివారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా చర్యలు తీసుకుంటున్నామని పుల్వామా దాడి ఘటన తర్వాత భారత్ స్పష్టం చేసింది.
Samayam Telugu india imports from pak


పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భారత్ తీసుకున్న ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉపసంహరణ, కస్టమ్స్ డ్యూటీ పెంపు నిర్ణయాల వల్ల ఆర్థికంగా పాక్‌కు మరిన్ని చిక్కులు తప్పవు. ఇరు దేశాల మధ్య ఏటా 200 కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. పాక్‌కు పత్తి, రసాయనాలు, కూరగాయలు, ఐరన్, స్టీల్‌ను భారత్ ఎగుమతి చేస్తోంది. పొరుగు దేశం నుంచి పండ్లు, సిమెంట్, తోలు, రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.