యాప్నగరం

చెట్టును ఢీకొట్టిన పికప్ వ్యాన్.. 10 మంది దుర్మరణం, 13 మందికి గాయాలు

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ చెట్టును ఢీకొట్టడంతో ఒకే గ్రామానికి చెందిన పది మంది దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు.

Samayam Telugu 9 May 2019, 10:29 pm
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పికప్ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడగా.. 13 మంది గాయపడ్డారు. వీరంతా దసుయా సమీపంలోని ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఉన్న ప్రార్థనా మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా.. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu 69255468


ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పీర్ నిగాహను దర్శించుకోవడానికి గురువారం ఉదయం మహీంద్రా పికప్ వ్యాన్‌లో వెళ్లారని తెలుస్తోంది. తిరిగొస్తుండగా.. వాహనం చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని పోలీసులు, స్థానికులు వారిని హాస్పిటల్‌కు తరలించగా.. పది మంది అప్పటికే చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 13 మంది గాయపడగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పరామర్శించిన కలెక్టర్.. మరణించిన వారికి లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ.25 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందించాలని హాస్పిటల్‌కు సూచించారు.

వాహనం ఎందుకు అదుపు తప్పిందనే విషయం తనకు అర్థం కావడం లేదని వాహనాన్ని నడిపిన జస్వీందర్ సింగ్ పోలీసులకు చెప్పారు. ఈ ప్రమాదంలో జస్విందర్ గాయపడగా.. ఆయన పక్క సీట్లో కూర్చొన్న అతడి భార్య మమత చనిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.