యాప్నగరం

Office Timings: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు

వేసవి కాలంలో పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తారు కదా.. అదే తరహాలో పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల పని వేళలను మార్చింది. ఉదయం 7.30 గంటలకు ఆఫీసులను తెరిచి మధ్యాహ్నం 2 గంటలకు మూసేయాలని నిర్ణయించింది. మే 2వ తేదీ నుంచి జులై 15 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులు కుటుంబాలతో గడిపే సమయం పెరగడంతోపాటు విద్యుత్ ఆదా అవుతుందని మన్ సర్కారు భావిస్తోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 8 Apr 2023, 5:07 pm

ప్రధానాంశాలు:

  • వేసవి, విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో పంజాబ్ వినూత్న నిర్ణయం
  • ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు
  • మే 2 నుంచి జులై 15 వరకు ఈ పని వేళలు వర్తింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Government Office
Govt Office
మండుతున్న ఎండలు, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లోని గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్‌నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాడకం తగ్గి, లోడ్ భారం కూడా తగ్గుతుందన్నారు. పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివరాల ప్రకారం ఆ రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 తర్వాత మొదలవుతుంది. ఒక వేళ 2 గంటలకు ప్రభుత్వ ఆఫీసులను మూసేస్తే.. 300 నుంచి 500 మెగావాట్ల మేర పీక్ లోడ్ తగ్గించడానికి తోడ్పడుతుందని సీఎం భగవంత్ మన్ తెలిపారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని సీఎం ప్రకటించారు.

పంజాబ్ ప్రభుత్వం నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగుల పనితీరుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కొత్త పని వేళలకు తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. కొందరైతే సాయంత్రం 4 కాగానే ఉద్యోగులు మందు కొట్టడానికి బయటకు వెళ్తారంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
కానీ పంజాబ్ సర్కారు మాత్రం తమ నిర్ణయం వల్ల విద్యుత్ ఆదా కావడంతోపాటు.. ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడుతుందనే ధీమాతో ఉంది. ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపే సమయం పెరుగుతుందని ఆప్ సర్కారు చెబుతోంది. వేసవి సీజన్ మొదలు కావడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో చాలా రాష్ట్రాలు విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. బాధ్యతయుతంగా విద్యుత్ వాడటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని పంజాబ్ సర్కారు భావిస్తోంది. అందుకు అనుగుణంగానే పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల పని వేళలు మార్చడం గమనార్హం.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.