యాప్నగరం

బాదల్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక: ప్రధాని

ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్నికవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

TNN 27 Jan 2017, 5:02 pm
ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్నికవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) కురువృద్ధుడైన బాదల్ ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారని, కానీ ఎప్పుడూ ఆయన పార్టీలు మార్చలేదని, ఆశయాల విషయంలో వెనకడుగు వేయలేదని మోదీ కొనియాడారు.
Samayam Telugu punjab wants to see cm parkash singh badal re elected pm narendra modi
బాదల్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక: ప్రధాని


రాబోయే ఎన్నికలు ధైర్య సాహసాలు నిండిన ఈ నేల బలాన్ని పునరుద్ధరిస్తాయని సీఎం బాదల్ వైపు చూస్తూ మోదీ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా పెరిగిపోతుందని వస్తున్న ఆరోపణలపై స్పందించిన మోదీ.. ఇక్కడ యువత గురించి తప్పుగా మాట్లాడుతున్న కొంతమంది రాష్ట్రాన్ని వేలెత్తి చూపడం మాని వారు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. తిరిగి అధికారంలోకి వచ్చే సత్తా కాంగ్రెస్‌కి లేదన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడే మరో దారి లేక అదే పార్టీతో జతకట్టిందని విమర్శించారు.

‘మునిగిపోయే పడవలో పంజాబ్ ప్రజలు కాలుపెట్టాలని అనుకుంటున్నారా?’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. సింధూ నదిపై భారత్‌కు పూర్తి హక్కు ఉందని, నీటిని ఎలాగైనా వెనక్కు తీసుకొస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 4న జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ-ఎస్ఏడీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.