యాప్నగరం

భారత్‌లో త్వరలో ఖతార్ ఎయిర్‌లైన్ ప్రారంభం

ఖతార్ ఎయిర్‌వేస్ త్వరలో పూర్తిగా ఖతార్ ప్రభుత్వ ఖర్చులతో ఇండియాలో ఒక ఎయిర్‌లైన్‌ను ప్రారంభించనుంది.

TNN 9 Mar 2017, 2:34 pm
ఖతార్ ఎయిర్‌వేస్ త్వరలో పూర్తిగా ఖతార్ ప్రభుత్వ ఖర్చులతో ఇండియాలో ఒక ఎయిర్‌లైన్‌ను ప్రారంభించనుంది. మోడీ ప్రభుత్వం గతేడాది జూన్‌లో విమానయాన రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతిచ్చిన తర్వాత.. మన దేశంలో మొదటిసారిగా ఒక విదేశీ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఎయిర్‌లైన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఖతార్ ఎయిర్‌వేస్ చాలా ఏళ్లుగా ఇండిగోతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. కానీ, భారత్.. ఆ దిశగా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తెలపలేదు. దీంతో 100% ఎఫ్‌డీఐ ద్వారా తమ సేవలను ప్రారంభించాలని ఖతార్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu qatar airways plans first fully foreign owned airline in india
భారత్‌లో త్వరలో ఖతార్ ఎయిర్‌లైన్ ప్రారంభం


గతంలో 49% వరకూ పెట్టుబడులకు అవకాశం ఉన్నా.. ఖతార్ ఎయిర్‌వేస్‌కు మిగతా 51% పెట్టుబడుల కోసం ఇండియన్ పాట్నర్ లభించలేదు. తాజాగా ఉన్న వెసులుబాటుతో మరో విదేశీ భాగస్వామితో కూడా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇలాంటి అంశాల్లో పూర్తి స్థాయి నియంత్రణ, యాజమాన్య హక్కుల (SOEC) విషయానికి సంబంధించి.. భారత్ ఇంకా ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేదు.

ప్రస్తుతం మన దేశంలో.. భారతీయుల నేతృత్వంలోని సంస్థలకే ఫ్లైయింగ్ హక్కులను ఇస్తున్నారు. సంస్థకు చెందిన బోర్డు సభ్యుల్లో 2/3వ వంతు మంది కచ్చితంగా భారతీయులే అయుండాలి అనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. గగనతల అనుమతుల్లో.. స్వదేశీ, ద్వైపాక్షిక అనుమతులు అనే రెండు రకాలున్నాయి. ద్వైపాక్షిక అనుమతులకు సంబంధించి ఇంర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.