యాప్నగరం

ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఇంతమంది పోటీయా?

జయలలిత నియోజక వర్గమైన ఆర్కేనగర్‌కు ఏప్రిల్ 12న ఉపఎన్నిక జరగనుంది.

TNN 28 Mar 2017, 10:53 am
జయలలిత నియోజక వర్గమైన ఆర్కేనగర్‌కు ఏప్రిల్ 12న ఉపఎన్నిక జరగనుంది. ఆ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు 62 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఏడుగురు అభ్యర్ధులు మినహా మిగతావారంతా స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులే. నామినేషన్ల పర్వం మార్చి 23వరకు సాగింది. కాగా శశికళ వర్గం నుంచి, పన్నీరు వర్గం నుంచి, అలాగే దీప, డీఎంకే అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పోటీ ఈ నలుగురి మధ్యనే ఉంటుంది.
Samayam Telugu r k nagar bypoll 62 candidates in the fray
ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఇంతమంది పోటీయా?


ముఖ్యంగా దీపకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఆమె తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించింది. ఎన్నికల కమిషన్ ఆమె ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పార్టీకి పడవ గుర్తును కేటాయించింది. ఇక అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులనును ఫ్రీజ్ చేసి, శశికళ వర్గానికి టోపీని, పన్నీరు వర్గానికి విద్యుత్ స్థంభాన్ని ఇచ్చింది ఈసీ. మొత్తం 127 మంది నామినేషన్లు దాఖలు చేయగా... అందులో కొంత మందివి చెల్లలేదు. మరో 20 మంది చివరి రోజు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి 67 మంది అభ్యర్థులు మిగిలారు. వీరందరికీ ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు.

కాగా బీజేపీ ఈ నియోజకవర్గంలో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ను నిలబెట్టింది. గంగై సినీ కళాకారుల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ ను కూడా ఆయన కలుసుకున్నారు. దీంతో రజనీ ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని రజినీకాంత్ ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.