యాప్నగరం

కొడుకుల పెళ్లయ్యాకే ఛాత్ పూజ: రబ్రీ

రబ్రీదేవి తన కొడుకులకు పెళ్లయ్యే వరకు ఛత్ పూజ చేయకూడదని నిర్ణయించుకున్నారట.

TNN 31 Oct 2016, 7:36 pm
బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి తన కొడుకులకు పెళ్లయ్యే వరకు ఛత్ పూజ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఛాత్ పూజను పెళ్లయిన నాటి నుంచి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు రబ్రీదేవి. ఛాత్ పూజలో సూర్యదేవుడిని ఘనంగా పూజిస్తారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఈ పండుగలను పెద్ద ఎత్తున చేస్తారు. దివాళీ తర్వాత వచ్చే వారాంతంలో ఛాత్ పండుగను నిర్వహిస్తారు. కాగా రబ్రీ దేవి ఆ పండుగను చాలా ఆడంబరంగా నిర్వహిస్తారు. ఆ రోజున బీహార్లోని ప్రముఖులంతా లాలూ ఇంట్లోనే సందడి చేస్తారు. అయితే ఇకపై మాత్రం తన కొడుకులకి పెళ్లయ్యాకే ఆ పండుగను చేసుకుంటానని ఆమె మీడియాకు తెలియజేశారు.
Samayam Telugu rabri devi will celebrate chhath only after her two sons marriage
కొడుకుల పెళ్లయ్యాకే ఛాత్ పూజ: రబ్రీ


రబ్రీకి తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ అని ఇద్దరు కొడుకులున్నారు. అందులో తేజస్వి బీహార్ డిప్యూటీ సీఎం, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారిద్దరికి వచ్చే ఏడాది కల్లా ఎలాగైనా పెళ్లిళ్లు చేయాలని లాలూ, రబ్రీ దంపతులు నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఛాత్ పూజకు ఇద్దరు కొత్త కోడళ్లతో కలిసి ఆ పండుగను చేసుకోవాలని రబ్రీ ఆశిస్తున్నారు. ఇద్దరు కొడుకుల సంబంధాలపై ఇంట్లో తీవ్రంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.