యాప్నగరం

ఇద్దరు మాజీ క్రికెటర్లకు బీజేపీ గాలం!

కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకోసం అన్ని అస్త్రాలనూ సంధిస్తోంది.

Samayam Telugu 17 Apr 2018, 5:50 pm
కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకోసం అన్ని అస్త్రాలనూ సంధిస్తోంది. అందుకోసం ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. సెలబ్రిటీల గ్లామర్ ను కూడా పార్టీ కోసం ఉపయోగించుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా కర్ణాటకకే చెందిన ఇద్దరు ప్రముఖ మాజీ క్రికెటర్లకు బీజేపీ గాలం వేస్తోందని సమాచారం. వారిద్దరూ మరెవరో కాదు.. లెజెండరీ క్రికెటర్లు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్.
Samayam Telugu dravidkumble


వీళ్లను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ మేరకు సంప్రదింపుల్లో ఉన్నారట కమలనాథులు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ నేతలు ధ్రువీకరిస్తున్నారు. ద్రావిడ్, కుంబ్లేలు తమ పార్టీలో చేరడం ఖాయమని కూడా కర్ణాటక కమలనాథులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోపే వారిద్దరి మద్దతునూ తాము సంపాదించగలమని చెబుతున్నారు. అంతే కాదు.. వారిద్దర్లో ఒకరిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేయడం, మరొకరిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించడం తమ ప్రణాళిక అని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి.

కమలనాథులు ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి కుంబ్లే, ద్రావిడ్‌లు రాజకీయాల వైపు వచ్చేలా లేరు. ఇది వరకూ ఒకసారి బీజేపీకి మద్దతుగా నిలిచాడు కుంబ్లే. జేడీఎస్ నేత కుమారస్వామి మిత్రధర్మాన్ని పాటించక, యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసినప్పుడు కుంబ్లే బీజేపీకి మద్దతుగా వచ్చాడు. ఆ సమయంలో యడ్యూరప్ప నిర్వహించిన సభలూ, సమావేశాల్లో కుంబ్లే పాల్గొని సంఘీభావం తెలిపాడు. అయితే ఆ తర్వాత రాజకీయంగా కుంబ్లే బీజేపీ తరఫున ప్రచారం ఏమీ చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.