ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శల వర్షం కురిపించారు. ఆమె కుమార్తెకు చెందిన న్యాయ సంస్థపై సీబీఐ దాడులు ఎందుకు చేయలేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. పీఎన్బీ కుంభకోణంలో కుమార్తెను కాపాడేందుకే జైట్లీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగి ఇన్నాళ్లవుతున్నా ఆయన స్పందించకపోవడానికి గల కారణం ఇప్పుడు తెలిసిందన్నారు.
‘‘పీఎన్బీ కుంభకోణంపై ఆర్థిక మంత్రి మౌనానికి కారణం ఇప్పుడు బయటపడింది. న్యాయవాదైన ఆయన కుమార్తెను కాపాడుకునేందుకు జైట్లీ ప్రయత్నిస్తున్నారు. కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే జైట్లీ కుమార్తె నిర్వహిస్తున్న న్యాయ సంస్థకు నిందితులు భారీగా చెల్లింపులు చేశారు. నిందితులతో సంబంధాలున్న ఇతర న్యాయ సంస్థలపై కూడా సీబీఐ దాడులు జరపాలి. కానీ, కేంద్ర మంత్రి జైట్లీ కుమార్తె సంస్థపై ఎందుకు దాడులు జరగలేదు?’’ అని రాహుల్ ప్రశ్నించారు.
‘‘పీఎన్బీ కుంభకోణంపై ఆర్థిక మంత్రి మౌనానికి కారణం ఇప్పుడు బయటపడింది. న్యాయవాదైన ఆయన కుమార్తెను కాపాడుకునేందుకు జైట్లీ ప్రయత్నిస్తున్నారు. కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే జైట్లీ కుమార్తె నిర్వహిస్తున్న న్యాయ సంస్థకు నిందితులు భారీగా చెల్లింపులు చేశారు. నిందితులతో సంబంధాలున్న ఇతర న్యాయ సంస్థలపై కూడా సీబీఐ దాడులు జరపాలి. కానీ, కేంద్ర మంత్రి జైట్లీ కుమార్తె సంస్థపై ఎందుకు దాడులు జరగలేదు?’’ అని రాహుల్ ప్రశ్నించారు.