యాప్నగరం

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున ఖర్గే..

ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకమార్పులు చేశారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు, ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు.

Samayam Telugu 22 Jun 2018, 6:08 pm
ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకమార్పులు చేశారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు, ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శుక్రవారం (జూన్ 22) విడుదల చేశారు. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను నియమించారు.
Samayam Telugu Kharge


ఖర్గే ప్రధాన కార్యదర్శి బాధ్యతలతోపాటు అదనంగా మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకోనున్నారు. ఖర్గేతోపాటు గుజరాత్‌కు చెందిన సోనల్ పటేల్, హర్యానాకు చెందిన ఆశిష్ దువా, తెలంగాణకు చెందిన సంపత్ కుమార్ మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శులుగా నియమితులయ్యారు.

మరోవైపు.. ఏపీకి చెందిన జేడీ శీలం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మెయ్యప్పన్‌లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించింది. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషిని నియమితులయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.