యాప్నగరం

Rahul Gandhi: బుల్లెట్​ బండెక్కి దూసుకెళ్లిన రాహుల్​ గాంధీ... కాంగ్రెస్ నేతల్లో జోష్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. (Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కదులుతున్నారు. తనదైన శైలీలో స్థానికులను ఆకట్టుకుంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నింపుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ఆయన.. తాజాగా బుల్లెట్ బండి ఎక్కి హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా రాహుల్‌ గాంధీతో పాటు సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా జత అవుతున్నారు. భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 Nov 2022, 4:51 pm

ప్రధానాంశాలు:

  • మధ్యప్రదేశ్‌లో సాగుతున్న జోడో యాత్ర
  • ఉత్సాహంగా కదులుతున్న రాహుల్ గాంధీ
  • సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న రాహుల్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rahul Gandhi Bike Ride
Rahul Gandhi: రాహుల్ గాంధీ... మొన్న నడి రోడ్డుపై పిల్లవాడితో పుష్‌ అప్‌లు చేశారు.. నిన్న మీసం తిప్పారు... నేడు బుల్లెట్ బైక్ ఎక్కి రయ్ రయ్ అని దూసుకుపోయారు. ఇవన్నీ భారత్‌ జోడో యాత్రలోని దృశ్యాలు. ఇంత ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. రోజురోజుకు మరింత విభిన్నంగా.. ఉల్లాసంగా యాత్రను కొనసాగిస్తున్నారు. యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం మో ప్రాంతంలో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాహుల్ బైక్ నడుపుతుంటుండగా పార్టీ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ పెద్దఎత్తున గుమిగూడారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు జ‌రుపుతూ కనిపించారు. కాగా రాహుల్ గాంధీ ఎంతో ఉత్సాహభరితంగా యాత్రను సాగిస్తున్నారు. ఆయనతో పాటు సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా జత అవుతున్నారు. రాహుల్ గాంధీ తనతో నడుస్తున్నవారిని ఉత్సహపరుస్తున్నారు.

కాగా సెప్టెంబర్ ఏడో తేదీన క‌న్యా కుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో విజయవంతంగా సాగింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్ చేరుకుంది. క‌న్యాకుమారి నుంచి చేప‌ట్టిన ఈ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతూ క‌శ్మీర్‌లో ముగియ‌నుంది. ఈ యాత్ర సందర్భంగా మోదీ సర్కార్ పాద‌యాత్ర సంద‌ర్భంగా మోదీ పాలనలోని వైఫల్యాలను, విధానాలను రాహుల్ గాంధీ ఎండగడుతున్నారు. స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.

Read Also: National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.