యాప్నగరం

రైతులతో రాహుల్ సహపంక్తి భోజనం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులతో కలిసి లంచ్ చేశారు. బుధవారం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో

Samayam Telugu 2 Feb 2017, 3:11 pm
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులతో కలిసి లంచ్ చేశారు. బుధవారం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సంగ్రూర్ లోని రైతులు, ప్రజలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. రైతులతో పాటే కూర్చొని ‘దాల్ సబ్జీ’ తిన్నారు.
Samayam Telugu rahul gandhi had lunch with punjab farmers
రైతులతో రాహుల్ సహపంక్తి భోజనం


అనంతరం నులక మంచంపై కూర్చొని బలియన్ గ్రామస్థులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రజలు స్థానికంగా నెలకొన్న సమలస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘‘అసాంఘిక శక్తులతో అంటకాగుతున్న కూటమి, రాజకీయ పార్టీలకు ఓటెయ్య వద్దు’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

పంజాబ్ లో ఈ రోజు సాయంత్రం 5గంటలకు ప్రచార గడువు ముగుస్తుంది. ఈ శనివారమే రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో శిరోమణి అకాలీదల్-బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రికోణపు పోటీ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.