యాప్నగరం

రాహుల్ గాంధీ..వరస్ట్ పార్లమెంటేరియన్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ చరిత్రలో వరస్ట్ పార్లమెంటేరియన్ అని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పార్లమెంటుకు ఎప్పుడూ డుమ్మాలు కొట్టే రాహుల్ గాంధీ...మోదీ సభకు హాజరుకావడం లేదని అనడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత బీవీఎల్ నర్సింహ్మారావు హెద్దేవా చేశారు. ‘పార్లమెంటుకు తరచూ డుమ్మా కొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ. పార్లమెంటు బయట ఉండి కూడా ఆయన చేసేదేమీ ఉండదు. లోక్‌సభ చరిత్రలో రాహుల్ గాంధీ అంతటి వరస్ట్ పార్లమెంటరేయిన్ ఇంకెవరూ లేరు. అలాంటి వ్యక్తి ప్రధాని మోదీ అటెండెన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని నర్సింహ్మారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ప్రధాని గురించి రాహుల్ మాట్లాడేంత స్థాయి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంలో పాదర్శకత సాధించి, క్రమశిక్షణ నేర్పించిన నాయకుడు మోదీ అని..అలాంటి నాయకుడి దగ్గర పార్లమెంటేరియన్ బాధ్యతలు అంటే ఏమిటో రాహుల్ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. నోట్ల రద్దుపై బయట మాట్లాడే ప్రధాని సభలో ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. నోట్లరద్దుపై ప్రజల మద్దతు కోసం నవ్వుతూ, ఏడ్చుతూ మాట్లాడే మోదీ...ఎమోషనల్ స్పీచ్ కోసం తాము పార్లమెంటులో ఎదురు చూస్తున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 26 Nov 2016, 4:10 pm
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ చరిత్రలో వరస్ట్ పార్లమెంటేరియన్ అని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పార్లమెంటుకు ఎప్పుడూ డుమ్మాలు కొట్టే రాహుల్ గాంధీ...మోదీ సభకు హాజరుకావడం లేదని అనడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత బీవీఎల్ నర్సింహ్మారావు హెద్దేవా చేశారు.
Samayam Telugu rahul gandhi is a worst parliamentarian says bjp
రాహుల్ గాంధీ..వరస్ట్ పార్లమెంటేరియన్


‘పార్లమెంటుకు తరచూ డుమ్మా కొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ. పార్లమెంటు బయట ఉండి కూడా ఆయన చేసేదేమీ ఉండదు. లోక్‌సభ చరిత్రలో రాహుల్ గాంధీ అంతటి వరస్ట్ పార్లమెంటరేయిన్ ఇంకెవరూ లేరు. అలాంటి వ్యక్తి ప్రధాని మోదీ అటెండెన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని నర్సింహ్మారావు అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ప్రధాని గురించి రాహుల్ మాట్లాడేంత స్థాయి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంలో పాదర్శకత సాధించి, క్రమశిక్షణ నేర్పించిన నాయకుడు మోదీ అని..అలాంటి నాయకుడి దగ్గర పార్లమెంటేరియన్ బాధ్యతలు అంటే ఏమిటో రాహుల్ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.

నోట్ల రద్దుపై బయట మాట్లాడే ప్రధాని సభలో ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. నోట్లరద్దుపై ప్రజల మద్దతు కోసం నవ్వుతూ, ఏడ్చుతూ మాట్లాడే మోదీ...ఎమోషనల్ స్పీచ్ కోసం తాము పార్లమెంటులో ఎదురు చూస్తున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.