ప్రస్తుతం లండన్లో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఉన్నావ్ అత్యాచార ఘటన, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ వ్యవహారంపై ఇంతవరకు మోదీ ఎందుకు నోరువిప్పలేదని రాహుల్ గాంధీ నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరిట దేశాన్ని విడదీస్తోందని రాహుల్ ఆరోపించారు. మతాల పేరిట దేశాన్ని విడగొట్టే పనిని భుజానికెత్తుకున్న బీజేపీ ప్రజలను పట్టించుకోవడం మానేసిందని దుయ్యబట్టారు. అయితే దేశఐక్యత కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టే తమపై కాషాయదళం ఎదురుదాడి చేస్తోందని, విద్వేష రాజకీయాలు చేయడం తమ అభిమతం కాదని రాహుల్ ధ్వజమెత్తారు.
జస్టిస్ లోయా మృతి కేసుతో సంబంధమున్న అమిత్ షాను బీజేపీ అధ్యక్షుడిగా చేశారని, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ విషయాల్లో కేంద్రం పదేపదే జోక్యం చేసుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు న్యాయం కోసం ప్రజలే ధర్మాసనం వద్దకు వేళ్లే వారు... కానీ బీజేపీ హయాంలో న్యాయమూర్తులే వారి వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పండిందని అన్నారు. తమ పనిని తాము చేసుకోనివ్వడం లేదని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేసేలా కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తోందని దుయ్యబట్టారు. దేశానికి మూలస్తంభాల్లాంటి సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ అన్నింట్లోనూ కేంద్రం జ్యోక్యంతో అవి స్వేచ్ఛను కోల్పోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు.
తాను అధికారంలోకి రాక ముందు దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ గతంలో చాలాసార్లు అన్నారని, దేశానికి నిర్మాణానికి పాటు పడిన వారిని ఆయన అవమానిస్తున్నారని విమర్శిచారు. మోదీ హయాంలో అనిల్ అంబానీ లాంటి వాళ్లు తప్ప ఇంకెవరూ బాగుపడలేదని, చైనా రోజుకు 50,000 ఉద్యోగాలను సృష్టిస్తుంటే, భారత్ మాత్రం కేవలం 450 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చి లండన్లో స్థిరపడిన భారతీయులు భారతావనికి ఎంతో గర్వకారణమని, మీలాంటి వారి వల్లే కాంగ్రెస్ ఇంత బలంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూకూడా ఎన్ఆర్ఐలేనని, ప్రపంచ నలుమూలలా కలియ తిరిగి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని వ్యాఖ్యానించారు.
జస్టిస్ లోయా మృతి కేసుతో సంబంధమున్న అమిత్ షాను బీజేపీ అధ్యక్షుడిగా చేశారని, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ విషయాల్లో కేంద్రం పదేపదే జోక్యం చేసుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు న్యాయం కోసం ప్రజలే ధర్మాసనం వద్దకు వేళ్లే వారు... కానీ బీజేపీ హయాంలో న్యాయమూర్తులే వారి వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పండిందని అన్నారు. తమ పనిని తాము చేసుకోనివ్వడం లేదని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేసేలా కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తోందని దుయ్యబట్టారు. దేశానికి మూలస్తంభాల్లాంటి సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ అన్నింట్లోనూ కేంద్రం జ్యోక్యంతో అవి స్వేచ్ఛను కోల్పోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు.
తాను అధికారంలోకి రాక ముందు దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ గతంలో చాలాసార్లు అన్నారని, దేశానికి నిర్మాణానికి పాటు పడిన వారిని ఆయన అవమానిస్తున్నారని విమర్శిచారు. మోదీ హయాంలో అనిల్ అంబానీ లాంటి వాళ్లు తప్ప ఇంకెవరూ బాగుపడలేదని, చైనా రోజుకు 50,000 ఉద్యోగాలను సృష్టిస్తుంటే, భారత్ మాత్రం కేవలం 450 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చి లండన్లో స్థిరపడిన భారతీయులు భారతావనికి ఎంతో గర్వకారణమని, మీలాంటి వారి వల్లే కాంగ్రెస్ ఇంత బలంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూకూడా ఎన్ఆర్ఐలేనని, ప్రపంచ నలుమూలలా కలియ తిరిగి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని వ్యాఖ్యానించారు.