యాప్నగరం

Rahul Gandhi: కేరళ వరదలు..మోదీకి ఫోన్ చేసిన రాహుల్!

భారీవర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రిని కోరారు. ఈ మేరకు మోదీకి ఫోన్ చేసిన రాహుల్.. వరదలతో విలవిల్లాడుతున్న కేరళ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఆర్మీ, నేవీ సిబ్బందిని పెద్దఎత్తున తరలించాలని కోరారు.

Samayam Telugu 16 Aug 2018, 4:19 pm
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రిని కోరారు. ఈ మేరకు మోదీకి ఫోన్ చేసిన రాహుల్.. వరదలతో విలవిల్లాడుతున్న కేరళ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఆర్మీ, నేవీ సిబ్బందిని పెద్దఎత్తున తరలించాలని కోరారు. అలాగే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్రజలు, దాతలు పెద్దమనసుతో స్పందించి విరాళాలు అందజేయాలన్నారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ ఈ విషయాలను తెలిపారు.
Samayam Telugu rahul



సీఎం పినరాయి విజయన్ విజ్ఞప్తితో ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన మరో 12 బృందాలను కేరళ పంపేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. ఇప్పటికే 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తాజాగా కేటాయించిన బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాల సంఖ్య 30కి చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. పతనంతిట్ట, కోజికోడ్, ఎర్నాకులం, త్రిసూర్, అళప్పుజ పట్టణాల నుంచి దాదాపు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

వరదల కారణంగా మరణించినవారిక సంఖ్య దాదాపు 100 కు చేరింది. గతరెండు రోజుల్లోనే దాదాపు 50 మంది వరకు మరణించారు. టీ, కాఫీ, యాలకుల పంట దాదాపు వంద ఎకరాల్లో భారీ నష్టాన్ని చవిచూసింది. రైతులు కోట్లలో ఆదాయం కోల్పోయారు. వన్యప్రాణి జీవనం ఛిన్నాభిన్నమైంది. నిరాశ్రయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రజలకు తాగడానికి కూడా మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.