యాప్నగరం

58వేల కోట్లు పెట్టి కొన్నాచెప్పరా : రాహుల్

ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకొని నిబంధనలను పక్కన పెట్టి ఎక్కువ ధరకు ఫైటర్ జెట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఓ వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యవహారం నడిచిందని ఆరోపించారు.

TNN 6 Feb 2018, 9:35 pm
సుమారు రూ.58వేల కోట్లు విలువ చేసే రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం దాగి ఉందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌పై ఆరోపణలు సంధించారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌తో కిందటి యూపీఏ హయాంలోనే కుదిరిన అవగాహన ఒప్పందం ధర కంటే భారీగా ఎక్కువ పెట్టి ఎన్డీయే సర్కారు రాఫెల్ జెట్ ఫైటర్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు.
Samayam Telugu rahul gandhi taunts government on rafale with top secret
58వేల కోట్లు పెట్టి కొన్నాచెప్పరా : రాహుల్


యూపీఏ సర్కారు ఒప్పుకున్న దాని కంటే తక్కువ ధరకే యుద్ధ విమానాలు కొనుగోలు చేసినట్లు 2017 నవంబర్ లో రక్షణమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆతర్వాత వెనుకంజ వేశారు. రహస్య సమాచారం పేరుతో ఒక్కో ఫైటర్ జెట్ ను ఏ ధరకు కొనుగోలు చేశారన్న సమాచారాన్ని వెల్లడించేందుకు నిరాకరించారు.

దీంతో రాహుల్ తన ఆరోపణలకు పదును పెట్టారు. రహస్య సమాచారం పేరుతో రూ.58 వేల కోట్లకు సంబంధించిన సమాచారాన్ని తొక్కి పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకొని నిబంధనలను పక్కన పెట్టి ఎక్కువ ధరకు ఫైటర్ జెట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఓ వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యవహారం నడిచిందని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.