యాప్నగరం

రాహుల్ గారూ.. ఇలాగైతే ఎలా?

అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన నేతలే.. ఇలా చట్టాలను ఉల్లంఘిస్తే సామాన్యులకు ఎలాంటి సందేశం వెళ్తుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు..

TNN 8 Jun 2017, 8:33 pm
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ (జూన్ 8) మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఆందోళనలు తీవ్రతరం కావడం వల్ల పోలీసులు ఆయణ్ని అక్కడికి వెళ్లకుండా పదే పదే అడ్డుకున్నారు. దీంతో ఆయన బైక్‌పై ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించారు. మాందసౌర్‌‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందు వల్ల పర్యటనకు అనుమతించేది లేదని రాహుల్‌కు పోలీసులు ఖరాకండీగా చెప్పేశారు. ఉదయ్‌పూర్‌ వద్ద రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ఆయన బైక్‌పై బయలుదేరారు.
Samayam Telugu rahul gandhi violates traffic rules on his way to mandsaur
రాహుల్ గారూ.. ఇలాగైతే ఎలా?


రాహుల్‌తో పాటు స్థానిక కాంగ్రెస్‌ నేత, భద్రతా సిబ్బంది సహా మొత్తం ముగ్గురు ఒకే బైక్‌పై కూర్చున్నారు. రాహుల్‌ మధ్యలో కూర్చొని ప్రయాణించారు. వాహనాన్ని నడిపిన వ్యక్తి హెల్మెట్‌ కూడా ధరించలేదు. ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి వెళ్లకూడదన్న నిబంధన ఉన్నా.. రాహుల్‌ గాంధీ పట్టించుకోకపోవడాన్ని కొంత మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు.

జాతీయ స్థాయి పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే ట్రాఫిక్‌ నియమాలను పాటించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన నేతలే.. ఇలా చట్టాలను ఉల్లంఘిస్తే సామాన్యులకు ఎలాంటి సందేశం వెళ్తుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిముచ్‌ సమీపానికి చేరుకున్న రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.