యాప్నగరం

రాహుల్ జోకర్‌లా మారారు: బీజేపీ ఎద్దేవా

రాహుల్ జోకర్ గా మారి..ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ్మారావు విమర్శించారు.

Samayam Telugu 14 Dec 2016, 2:26 pm
నోట్లరద్దు నేపథ్యంలో ప్రధాని మోదీకి సంబంధించిన అవినీతిని బయటపెడ్తానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్ అయ్యింది. రాహుల్ జోకర్ గా మారి..ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ్మారావు విమర్శించారు. రాహుల్ రాజకీయంగా దిగజారిపోతూ ఆయనలో ఉన్న కమేడియన్ ఎదిగిపోతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
Samayam Telugu rahul gandhis political value deteriorating while comical value increasing says bjp
రాహుల్ జోకర్‌లా మారారు: బీజేపీ ఎద్దేవా


చర్చలు చేపట్టడానికి అధికార పక్షం రెడీగా ఉందని, కానీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు.

తాను నోరు విప్పితి మోదీ బుడగ బద్ధలవుతుందని వ్యాఖ్యానించి రాహుల్ కు బీజీపే కౌంటర్ ఇచ్చింది. బుడగలతో ఆడుకునే వయసు కాదన్న సంగతి ప్రతిపక్ష నాయకులు గుర్తెరిగి...సభను సజావుగా సాగేలా చూడాలని బీజేపీ మరో నేత నలిన్ కోహ్లి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.