కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల గుజరాత్ పర్యటనకు శనివారం శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ఆయన సోమ్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పటికీ.. బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న రాహుల్.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వీరితో కలిసి ఎన్నికల ఫలితాలను సమీక్షించనున్నారు. గుజరాత్ యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలతో రాహుల్ భేటీ అవుతారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రధాని సొంత రాష్ట్రంలో 80 సీట్లను గెలుపొందింది. దీంతో బీజేపీ 100 సీట్లకే పరిమితమైంది.
గుజరాత్ ఎన్నికలు ముగిసిన రెండ్రోజులకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టారు. బాధ్యతలు స్వీకరించడంతోనే ఆయన ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, యూపీఏ హయాం నాటి 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులకు ఊరట లభించడంతో ఆ పార్టీ నేతలు ఖుషీగా ఉన్నారు. దేశంలో తమ పార్టీ పట్ల సానుకూలత కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రధాని సొంత రాష్ట్రంలో 80 సీట్లను గెలుపొందింది. దీంతో బీజేపీ 100 సీట్లకే పరిమితమైంది.
గుజరాత్ ఎన్నికలు ముగిసిన రెండ్రోజులకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టారు. బాధ్యతలు స్వీకరించడంతోనే ఆయన ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, యూపీఏ హయాం నాటి 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులకు ఊరట లభించడంతో ఆ పార్టీ నేతలు ఖుషీగా ఉన్నారు. దేశంలో తమ పార్టీ పట్ల సానుకూలత కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.