యాప్నగరం

రైల్వే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 32కు చేరింది. Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} -->

Samayam Telugu 22 Jan 2017, 10:38 am
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన హిరాఖండ్ రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 32కు చేరింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేల నష్టపరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu railways announces ex gratia to families of rail accident
రైల్వే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 32 మంది మృతిచెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందినవారేనని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.