రిజర్వేషన్ చార్ట్లకు రైల్వేశాఖ గుడ్ బై చెప్పింది. ఇకపై రైల్వే కోచ్లపై చార్ట్ పేపర్లను అంటించరు. మార్చి 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రైల్వేమంత్రిత్వశాఖ తెలిపింది. మూడు నెలలుగా ఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఈ పద్దతిని అమలు చేశారు. ఇది విజయవంతం కావడంతో... మిగిలిన స్టేషన్లలో కూడా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఏ1, ఏ రైల్వే స్టేషన్లలో పైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలల్లో చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 34 స్టేషన్లలో ఈ విధానం అమల్లోకి రానుంది.
రిజర్వేషన్ చార్ట్లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుల్లో ప్రయాణికులు తమ వివరాలను చూసుకోవచ్చు. డిజిటలైజేషన్లో భాగంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఏ1, ఏ స్టేషన్ల తర్వాత మెల్లిగా మిగిలిన స్టేషన్లలో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు రైల్వే అధికారులు.
రిజర్వేషన్ చార్ట్లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుల్లో ప్రయాణికులు తమ వివరాలను చూసుకోవచ్చు. డిజిటలైజేషన్లో భాగంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఏ1, ఏ స్టేషన్ల తర్వాత మెల్లిగా మిగిలిన స్టేషన్లలో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు రైల్వే అధికారులు.