యాప్నగరం

ఛార్జింగ్ కోసం తిప్పలు: వర్షం వెలిసింది.. క్యూలైన్ వచ్చింది!

వర్షం వెళ్లిపోయాక మొబైల్ టవర్ వద్ద కొంత మంది తమ సెల్ ఫోన్లు చేతబట్టుకొని క్యూ లైన్‌లో నిల్చోవడం చర్చనీయంగా మారింది. టవర్ వద్ద ఉన్న జనరేటర్‌ ద్వారా ఏకకాలంలో రెండు ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం దొరకడమే ఈ క్యూ లైన్‌కు కారణం.

Samayam Telugu 20 Jul 2018, 10:14 am
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కర్ణాటకలోని చిక్‌మగులూరు, మంగుళూరు, మైసూరు జిల్లాల్లోని కొన్న ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లకు అడ్డంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో అనేక గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. బుధవారం (జులై 18) వర్షం కాస్త తెరపి ఇవ్వడంతో అధికారులు సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు.
Samayam Telugu queue


విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెల్ ఫోన్ వినియోగదారుల కష్టాలు మరో రకంగా ఉన్నాయి. నాలుగైదు రోజులుగా ఛార్జింగ్ లేక ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లకు చేయి విరిగినంత పనైంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన కారణంగా కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో.. వర్షం తగ్గిన తర్వాత కూడా వారి కష్టాలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. చిక్‌మగులూరు జిల్లా మల్నాడ్ రీజియన్‌లోని ఓ మొబైల్ టవర్ వద్ద కొంత మంది తమ సెల్ ఫోన్లు చేతబట్టుకొని క్యూ లైన్‌లో నిల్చోవడం చర్చనీయంగా మారింది. టవర్ వద్ద ఉన్న జనరేటర్‌ ద్వారా ఏకకాలంలో రెండు ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం దొరకడమే ఈ క్యూ లైన్‌కు కారణం. టవర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కొక్కరిని అనుమతించడంతో తమ సమయం కోసం వేచి చూస్తూ.. ఇలా క్యూ కట్టారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం కొంత మంది తిండీ తిప్పలు కూడా మానేసి ఎదురు చూడటం మరింత ఆసక్తికరమైన అంశం. మన జీవితంలో సెల్ ఫోన్లు అంతలా భాగమైపోయాయి మరి!
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.