యాప్నగరం

Weather Update: రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు.. రైతన్న జర జాగ్రత్త!

Weather Update: రానున్న ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మధ్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Apr 2023, 9:25 pm

ప్రధానాంశాలు:

  • రానున్న ఐదు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు
  • ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం
  • మధ్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rains in India
భారత్‌లో వర్షాలు
Weather Update: భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Rains in India) కురుస్తాయని అంచనా వేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. IMD అంచనాల ప్రకారం.. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో హిమపాతం, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ భారతదేశంలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 1న రాయలసీమ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో, మే 2 వరకు రాయలసీమ, కర్ణాటక, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

అలాగే.. ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. మే 1, 2 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో.. మే 1 నుంచి మే 4 వరకు అస్సాం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయని హెచ్చరించడంతో.. రైతుల్లో ఆందోళనను మరింత పెరిగింది. భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.