యాప్నగరం

హీరోయిన్ భర్తకు ఈడీ సమన్లు!

రెండు వేల కోట్ల రూపాయల విలువైనదిగా చెప్పబడుతున్న బిట్ కాయిన్ స్కామ్‌లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు

TNN 5 Jun 2018, 3:20 pm
రెండు వేల కోట్ల రూపాయల విలువైనదిగా చెప్పబడుతున్న బిట్ కాయిన్ స్కామ్‌లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కుంద్రాను మంగళవారం ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఈడీకి అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారంతో రాజ్‌కుంద్రా పేరు బయటకు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ స్కామ్ లో కుంద్రా పాత్ర ఏమిటి? ఈడీ ఏ అంశం గురించి ఆరాతీసింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు.
Samayam Telugu raj-kundra


బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్తే రాజ్ కుంద్రా అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ జంట ఐపీఎల్‌తో బాగా పాపులర్. రాజస్థాన్ రాయల్స్ సహయజమానిగా వ్యవహరించాడు కుంద్రా. అయితే అక్కడ కూడా ఇతడి తీరు వివాదాస్పదం అయ్యింది.

ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో పాత్రధారి అయినందున కుద్రాపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇతడు క్రికెట్ వ్యవహారాల్లో తలదూర్చకూడదని జీవితకాల నిషేధం విధించింది. ఇప్పుడు మరో వివాదంలో రాజ్‌కుంద్రా పేరు వినిపిస్తూ ఉండటం విశేషం. తన భర్తకు ఈడీ సమన్లపై శిల్పాషెట్టి ఇంకా స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.