యాప్నగరం

పనికిరాని వెంటిలేటర్లు ఇచ్చారు.! కాంగ్రెస్ సీఎం సంచలన ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వం పంపించిన వైద్య పరికరాలపై సంచలన ఆరోపలు చేశారు రాజస్ధాన్ సీఎం. అవి లోపభూయిష్టంగా ఉన్నాయని.. వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నాణ్యత లేని కారణంగా ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు.

Samayam Telugu 14 May 2021, 11:54 pm
కరోనా కష్టకాలంలో కేంద్రం పంపించిన వైద్య పరికరాలపై సంచలన ఆరోపణలు చేశారు రాజస్ధాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. కేంద్రం పంపిన వెంటిలేటర్లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లోపభూయిష్టమైన వెంటిలేటర్లను కేంద్రం అందించిందని.. వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. కేంద్రం పంపించిన వెంటిలేటర్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వైద్యులు గుర్తించారని.. అవి కోవిడ్ రోగుల ప్రాణాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం కేర్స్ ఫండ్ కింద రాష్ట్రానికి పంపించిన వెంటిలేటర్లలో సమస్యలు ఉన్నాయని.. ప్రెజర్ డ్రాప్ సమస్య ఉందన్నారు. వైద్య పరికరాల వైఫల్యం రోగుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోందని.. వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఆయన కేంద్రానికి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. పలు రాష్ట్రాల్లోనూ ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Samayam Telugu రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్(ఫైల్)


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.