యాప్నగరం

కాంగ్రెస్ సీఎంకి కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌లోకి ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రుల సైతం కరోనా బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తనకు లక్షణాలేవీ లేవని.. ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు.

Samayam Telugu 29 Apr 2021, 2:58 pm
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ కమ్మేస్తోంది కరోనా మహమ్మారి. సామాన్యుల నుంచి సీఎంల దాకా అందరూ బాధితులుగా మారుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నిన్న ఆయన భార్య సునీతకి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు సీఎం తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
asok gehlot


ఈరోజు కరోనా టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా తేలిందని.. అయితే లక్షణాలేవీ లేవని సీఎం చెప్పారు. ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఇటీవల పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.