రాజస్థాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయన ప్రయత్నించారనే ఆరోపణలతో పీసీసీ అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మాత్రం తాను బీజేపీలోకి వెళ్లడంలేదని, తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పనిచేసిన తాను ఆ పార్టీలోకి ఎలా వెళతానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.
తనకు ఎటువంటి స్థానం కల్పించాలో పార్టీ నిర్ణయించే ముందు నెల రోజుల సమయం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పినట్టు పైలట్ సన్నిహితులు పేర్కొన్నారు. అయితే, ఆయన రాజస్థాన్కు తిరిగి రావడం చాలా కష్టమని, యువ రాజకీయ నేతతో రాజీ కోసం ఎవరినీ పంపలేదని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ సచిన్ పైలట్ మాత్రం అధిష్ఠానంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. పార్టీ వైఖరిపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. జాతీయస్థాయిలో పైలట్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని, అయితే, తక్షణమే సాధ్యకాకపోవచ్చు కానీ, నెల రోజుల సమయం అవసరమని అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పైలట్కు గుర్తింపు ఉంది. ఎలాంటి షరతులు లేకుండా ఆయనను పార్టీలోకి తిరి తీసుకురావడం చాలా ముఖ్యం.
అటు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం స్వరం మార్చారు. గత 40ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, యువతరాన్ని ఎప్పుడూ అభిమానిస్తాను.. భవిష్యత్తు వారిదేనని వ్యాఖ్యానించారు. కొత్త తరం కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. మా తరంలో తాము చేసిన పనులు చేసుంటే అర్ధం చేసుకునేవారన్నారు.
అయితే, ప్రభుత్వాన్ని కూల్చడానికి బేరసారాలకు పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, ఇందు కోసం ఓ హోటల్లో 10 రోజులు మా ఎమ్మెల్యేలను ఉంచాల్సి వచ్చిందన్నారు. అలా చేసుండకపోతే మనేసర్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే జరిగేదని అన్నారు.
సచిన్ పైలట్కు ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ అవినాశ్ పాండే అన్నారు. తాను బీజేపీలో చేరట్లేదని సచిన్ పైలట్ ప్రకటించిన కాసేపటికే అవినాశ్ పాండే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘సచిన్ పైలట్కు కాంగ్రెస్ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. తన తప్పును తెలుసునేలా భగవంతుడు అతనికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. బీజేపీ వల నుంచి ఆయన బయటపడతారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
తనకు ఎటువంటి స్థానం కల్పించాలో పార్టీ నిర్ణయించే ముందు నెల రోజుల సమయం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పినట్టు పైలట్ సన్నిహితులు పేర్కొన్నారు. అయితే, ఆయన రాజస్థాన్కు తిరిగి రావడం చాలా కష్టమని, యువ రాజకీయ నేతతో రాజీ కోసం ఎవరినీ పంపలేదని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ సచిన్ పైలట్ మాత్రం అధిష్ఠానంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. పార్టీ వైఖరిపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. జాతీయస్థాయిలో పైలట్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని, అయితే, తక్షణమే సాధ్యకాకపోవచ్చు కానీ, నెల రోజుల సమయం అవసరమని అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పైలట్కు గుర్తింపు ఉంది. ఎలాంటి షరతులు లేకుండా ఆయనను పార్టీలోకి తిరి తీసుకురావడం చాలా ముఖ్యం.
అటు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం స్వరం మార్చారు. గత 40ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, యువతరాన్ని ఎప్పుడూ అభిమానిస్తాను.. భవిష్యత్తు వారిదేనని వ్యాఖ్యానించారు. కొత్త తరం కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. మా తరంలో తాము చేసిన పనులు చేసుంటే అర్ధం చేసుకునేవారన్నారు.
అయితే, ప్రభుత్వాన్ని కూల్చడానికి బేరసారాలకు పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, ఇందు కోసం ఓ హోటల్లో 10 రోజులు మా ఎమ్మెల్యేలను ఉంచాల్సి వచ్చిందన్నారు. అలా చేసుండకపోతే మనేసర్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే జరిగేదని అన్నారు.
సచిన్ పైలట్కు ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ అవినాశ్ పాండే అన్నారు. తాను బీజేపీలో చేరట్లేదని సచిన్ పైలట్ ప్రకటించిన కాసేపటికే అవినాశ్ పాండే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘సచిన్ పైలట్కు కాంగ్రెస్ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. తన తప్పును తెలుసునేలా భగవంతుడు అతనికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. బీజేపీ వల నుంచి ఆయన బయటపడతారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.