యాప్నగరం

అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. మనస్తాపంతో భర్త సూసైడ్

భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడో భర్త. డిటోనేటర్‌ను పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.

Samayam Telugu 16 Jul 2018, 11:53 am
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడో భర్త. డిటోనేటర్‌ను పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. స్థానికుల చెబుతున్న వివరాల మేరకు.. గోవర్థన్ విలాస్‌కు చెందిన వినోద్‌ మైన్స్‌లో పని చేస్తుండేవాడు. భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. ఐదు రోజుల క్రితం కూడా వినోద్ భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. ఆమె అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వినోద్ ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నాడు.
Samayam Telugu Rajasthan


భార్య అలిగి వెళ్లిపోయిందనే బాధతో ఉన్న వినోద్.. ఐదురోజులుగా తనలో తనే కుమిలిపోయాడు. ఆమె కోసం వెతికినా జాడ తెలియకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఉదయం డిటోనేటర్‌ను తన ఒంటికి కట్టుకొని తనను తాను పేల్చుకున్నాడు. అతడి శరీరం మొత్తం చిద్రమయ్యింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దగ్గర్లోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఆ ఫుటేజ్‌లో వినోద్ తన ఒంటికి డిటోనేటర్ కట్టుకోవడం, నిప్పు పెట్టుకోవడం రికార్డయ్యింది. ఫుటేజ్ ఉన్నా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. ఆ రిపోర్టులు వస్తే కాని ఏం చెప్పలేమంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.