యాప్నగరం

ష్‌..సైలెన్స్ ఫ్లీజ్..ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు

వారంతా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలు చర్చించి..పరిష్కారం కనుగొనేందుకు శాసనసభకు పంపిస్తే..పని

Samayam Telugu 9 Mar 2017, 7:11 pm
వారంతా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలు చర్చించి..పరిష్కారం కనుగొనేందుకు శాసనసభకు పంపిస్తే..పని పక్కనబెట్టి నిండు సభలోనే హాయిగా నిద్రపోతున్నారు. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఇలాగే నిద్రపోతూ మీడియాకు చిక్కారు.
Samayam Telugu rajasthan mlas sleeping in assembly while cm tabling budget
ష్‌..సైలెన్స్ ఫ్లీజ్..ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు


రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు తమ సీట్లలోనే కూర్చొని దర్జా కునుకు తీస్తున్నారు. కునుకు అంటే మాములు కునుకు కాదు..గుర్రు బెట్టి మరి నిద్రపోతున్నారు. బుధవారం సీఎం వసుంధర రాజే బడ్జెట్ వివరాలు సభలో వెల్లడించిన సమయంలో ఎమ్మెల్యేలు అదేమీ పట్టించుకోకుండా తమ ‘పని’ తాము చేసుకున్నారు.


సీఎం మాట్లాడుతున్నారనే భయం లేకుండా..చుట్టూ మీడియా ప్రతినిధులు (కెమెరాలు) చూస్తున్నారన్న కనీస స్పృహ కూడా లేకుండా నిద్రదేవతా ఒళ్లో సేద తీరుతున్న ఎమ్మెల్యేల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ​ వీరి విశ్రాంతికి అసెంబ్లీయే సరైన ప్లేసులా కనిపించినట్లు ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.