యాప్నగరం

కేం‍ద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పలు రంగాల్లో ఆయన నిష్ణాతులు.

Samayam Telugu 1 Sep 2020, 3:35 pm
ర్థిక శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌.. కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అశోక్ లవాసా రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ కుమార్ గత నెలలో ఆ పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని అశోక్ లవాసా స్థానంలో నియమించింది. మంగళవారం (సెప్టెంబర్ 1) ఉదయం ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి పనిచేయనున్నారు.
Samayam Telugu రాజీవ్ కుమార్
new election commissioner Rajeev Kumar (Photo: ANI)


సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ ఏప్రిల్‌ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) ఆయణ్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఛైర్మన్‌గా నియమించింది.

1984 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రాజీవ్‌ కుమార్‌ అనేక రంగాల్లో నిష్ణాతులు. పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.