యాప్నగరం

అటల్‌జీ అస్తమయం.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు.

Samayam Telugu 16 Aug 2018, 6:37 pm
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. యావత్ భారతదేశాన్ని దు:ఖసాగరంలో ముంచేస్తూ గురువారం (ఆగస్టు 16) సాయంత్రం 5.05 గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వాజ్‌పేయ్‌ మరణవార్త విన్న ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వాజ్‌పేయ్‌ మృతిపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.
Samayam Telugu వాజ్ పేయీ


‘గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోవడం నా మనసుని కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు రజినీకాంత్.
నిన్నటి (బుధవారం) అర్ధరాత్రి నుండి వాజ్ పేయి ఆరోగ్యం విషయంగానే ఉండటంతో ఎయిమ్స్‌ ఆసుపత్రికి నేతల తాకిడి పెరిగింది. తమ అభిమాన నేత ఆరోగ్యం విషమించిందని తెలిసినప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ వాజ్‌పేయీ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.