యాప్నగరం

నువెవ్వరూ..? తూత్తుకుడిలో రజనీకి యువకుడి ప్రశ్న!

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తూత్తుకుడి ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను ఓ యువకుడు ‘నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు.

Samayam Telugu 31 May 2018, 3:35 pm
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తూత్తుకుడి ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను ఓ యువకుడు ‘నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు. దీనికి తలైవా బదులిస్తూ.. నేను రజనీకాంత్‌ను అని సమాధానం చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాట చిన్నపిల్లాడు కూడా రజనీని గుర్తుపడతాడు. అలాంటిది సూపర్ స్టార్‌ను నువ్వెవరని ఓ యువకుడు ప్రశ్నించడం.. అక్కడి ప్రజల ఆగ్రహానికి, ఆవేదనకు అద్దం పడుతోంది.
Samayam Telugu rajini1


బుధవారం తూత్తుకుడి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని రజినీకాంత్ పరామర్శించారు. వంద రోజులపాటు తూత్తుకుడిలో నిరసన ప్రదర్శనలు చేపట్టినప్పటికీ.. రజనీ ఒక్క రోజు కూడా ఆ విషయమై నోరు మెదపలేదు. రజనీ మక్కల్ మండ్రమ్ నేతలు కూడా బాధితులతో మాట్లాడలేదు. ఆ కోపమే రజనీ పర్యటన సమయంలో బయటపడింది.

రజనీని ప్రశ్నించిన యువకుణ్ని తూత్తుకూడికి చెందిన 21 ఏళ్ల కె.సంతోష్ రాజ్‌గా గుర్తించారు. బీకాం చదువుకున్న ఈ యువకుడు తూత్తుకుడి ప్రాంతంలోని కాలేజీ విద్యార్థులను కూడగట్టి.. స్టెరిలైట్ ప్లాంట్ మూసివేయాలంటూ పోరాటం చేశాడు. మే 22న కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వెళ్తుండగా.. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో అతడి తలకు గాయమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.