యాప్నగరం

నా వెనుక ఆయన ఉన్నారు: రజినీ కాంత్

15 రోజుల ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకొని చెన్నై చేరుకున్న రజినీ కాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తన వెనుక ఎవరున్నారో స్పష్టం చేశారు.

TNN 20 Mar 2018, 6:21 pm
రజనీ కాంత్ చెన్నై చేరుకున్నారు. హిమాలయాల్లో 15 రోజుల ఆధ్యాత్మక యాత్రను పూర్తి చేసుకున్న ఆయన తిరిగి మంగళవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. తాను పర్యటించిన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను రజినీ ఇప్పటికే తన అభిమానులు ఫొటోలోను షేర్ చేసుకున్నారు. ఇది రాజకీయ యాత్ర అని కొంత మంది ప్రచారం చేయగా.. ఇది తనను తాను ఆవిష్కరించుకోవడానికి చేపట్టిన ప్రయాణమని రజినీ చెప్పారు.
Samayam Telugu Rajinikanth


యాత్ర ముగించుకుని చెన్నై చేరుకున్న సందర్భంగా రజినీ కాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. రామ రాజ్య రథ యాత్ర వివాదంపై ఆయన స్పందిస్తూ.. తమిళనాడు మత ప్రమేయం రాష్ట్రమని, పోలీసులు శాంతి భద్రతలను కాపాడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నా వెనుక బీజేపీ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ నా వెనుక దేవుడున్నాడు, ప్రజలున్నారని రజనీ చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఇదేనని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగం పెంచనున్న రజినీ.. త్వరలోనే ‘కాలా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నెలాఖారులో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఆడియో లాంచ్ చేయనుండగా.. ఏప్రిల్ 27న సినిమా విడుదల కానుంది. రజినీ నటించిన రోబో 2.0 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.

To Read this story in Tamil Click Here

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.