యాప్నగరం

Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలి ఆత్మహత్యాయత్నం

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె... ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంత వెంటనే గుర్తించిన పోలీసులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 21 Jul 2020, 1:17 pm
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారన్న విషయం మాత్రం తెలియరాలేదు. రాజీవ్‌ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Samayam Telugu నళిని శ్రీహరణ్
nalini sriharan

Read more: తమ్ముడికి కరోనా వచ్చిందని.. అన్న ఆత్మహత్య
తన కూతురు హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన ఆమె తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్‌ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. అయితే తాజాగా నళిని ఆత్మహత్యాయత్నం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై నళిని వ్యక్తిగత లాయర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా నళిని ఎప్పుడూ ఇలాంటి ఘటనకు పాల్పడలేదన్నారు. అయితే జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మరో మహిళతో నళినికి మనస్పర్థలు వచ్చాయన్నారు. ఆ విషయంలో ఏమైనా మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారాయన. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖపట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.